గోపీ న‌గ‌ర్‌లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ప‌రిధిలోని గోపీ న‌గ‌ర్‌లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాలనీలో నూతనంగా చేప‌ట్టిన సీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస‌ డివిజన్ ఉపాధ్యక్షుడు యాదా గౌడ్, సీనియర్ నాయకుడు కేఎన్‌ రాములు, గోపినగర్ కాలనీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నెహ్రు నగర్ కాలనీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, యూత్ అధ్యక్షుడు మహేందర్, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజు, నాయకులు గఫ్ఫార్, మహబూబ్ పాల్గొన్నారు.

సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here