ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ స‌మావేశం

హఫీజ్‌పేట (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా చూడాల‌ని మాదాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ స్థానిక తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సోమ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని గంగారం, సుభాష్ న‌గ‌ర్‌, యూత్ కాల‌నీ స‌భ్యుల‌తో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌ట్ట‌భ‌ద్రులు అంద‌రూ ఓట‌ర్లుగా న‌మోదు అయ్యేలా చూడాల‌న్నారు. వారు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసేలా చూడాల‌ని పిలుపునిచ్చారు.

తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను స్వీక‌రిస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here