విద్యానగర్ యూత్ ఆద్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి

భగత్ సింగ్ కు నివాళులర్పిస్తున్న కార్పొరేటర్లు బొబ్బ నవతరెడ్డి, వి.జగదీశ్వర్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, సునితాప్రభాకర్ రెడ్డి

చందానగర్ లోని విద్యానగర్ కమాన్ వద్ద స్థానిక యువత ఆద్వర్యంలో సోమవారం భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బొబ్బ నవతరెడ్డి, వి.జగదీశ్వర్ గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న వయస్సులోనే దేశంకోసం అమరుడైన భగత్ సింగ్ సేవలను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునితా ప్రభాకర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు పుట్ట వినయకుమార్ గౌడ్, నాయకులు జెరిపేటి రాజు, రాకేష్ దూబే, అక్భర్ ఖాన్, దాస్, నాగమహేష్ నిర్వాహకులు హరీష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, బబ్లు, అమిత్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ కు నివాళులర్పిస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, జెరిపేటి రాజు, పుట్ట వినయకుమార్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here