గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గురువారం అత్తాపూర్ లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయకు గంగాధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంగాధర్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
