చందాన‌గ‌ర్ సీఐ క్యాస్ట్రోని క‌లిసిన లింగంప‌ల్లి గ్రామ క‌మిటీ నాయ‌కులు

చందాన‌గ‌ర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ సీఐ క్యాస్ట్రోని లింగంప‌ల్లి గ్రామ క‌మిటీ నాయ‌కులు గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ లింగంప‌ల్లి గ్రామంలో శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా ఇప్ప‌టికే ఉన్న సీసీ కెమెరాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని, అవ‌స‌రం ఉన్న చోట నూత‌నంగా సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ ముదిరాజ్, ప్రతినిధులు ఎల్లేష్, సోమయ్య యాదవ్, లింగంశీను, కృష్ణ, విష్ణు, ప్రణయ్, యాదయ్య పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ సీఐ క్యాస్ట్రోకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న లింగంప‌ల్లి గ్రామ క‌మిటీ నాయ‌కులు
చందాన‌గ‌ర్ సీఐ క్యాస్ట్రోకు స‌మ‌స్య‌ను వివ‌రించిన లింగంప‌ల్లి గ్రామ క‌మిటీ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here