అభివృద్ధి ప‌నుల‌కు నిధులు మంజూరు చేయాలి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గ‌చ్చిబౌలి, సెప్టెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని గచ్చిబౌలి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల‌ని కోరుతూ మంగ‌ళ‌వారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. క‌మిష‌న‌ర్‌ను ఆయ‌న కార్యాల‌యంలో క‌లిసిన గంగాధ‌ర్ రెడ్డి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ‌, నేతాజీ నగర్, గోపనపల్లి, నల్లగండ్ల హుడా కాలనీలలో సీసీ రోడ్లు దెబ్బ తినడం వల్ల చిన్న పాటి వర్షానికే గుంతలలో నీరు నిలిచి స్థానిక ప్రజల‌ రాకపోకలకు ఇబ్బంది క‌లుగుతుంద‌న్నారు. ఇంచు మించు 2 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ వ్యయం ప్రపోజల్స్ ను మంజూరు చేయాల‌ని కోరారు. దీనికి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించార‌ని కార్పొరేట‌ర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకుడు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here