శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డిప్యూటీ కమీషనర్ గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రశాంతిని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ గా నియమితులైన సందర్భంగా ప్రశాంతి ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిప్యూటీ కమీషనర్ ప్రశాంతి తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అని కోరారు. అదేవిధంగా చెరువుల సుందరీకరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు.