సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేద‌ల‌కు నిరంత‌ర స‌హాయం: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సీఎం రిలీఫ్ ఫండ్ నిరంత‌రాయం పేద‌ల‌కు స‌హాయం అందిస్తుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో హాస్పిట‌ల్ ఖ‌ర్చుల నిమిత్తం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ల‌బ్ధిదారుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన స‌హాయాన్ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ గురువారం అంద‌జేశారు. మొత్తం రూ.11.98 ల‌క్ష‌ల విలువైన ఎల్‌వోసీ ప‌త్రాల‌ను బాధితుల‌కు ఆయ‌న పంపిణీ చేశారు.

బాధితుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయాన్ని అంద‌జేసిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్లు నార్నె శ్రీ‌నివాస రావు, దొడ్ల వెంక‌టేష్ గౌడ్

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. స‌హాయం అవ‌స‌రం ఉన్న ఎవ‌రైనా స‌రే సీఎం రిలీఫ్ ఫండ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వెంట‌నే స‌హాయం అందిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేట‌ర్‌ నార్నె శ్రీనివాస రావు, ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, సురేందర్, మోజేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here