సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకుల వినతి

నమస్తే శేరిలింగంపల్లి:హఫీజ్ పేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గుంతలమయమైన రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాల‌ని కాంగ్రెస్ పార్టీ మాదాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ డి.‌నగేష్ జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంజనీరింగ్ విభాగం అధికారులకు నగేష్ వినతి పత్రం అందజేశారు. హఫీజ్ పేట్ నుంచి ఆదిత్య ‌నగర్ వరకు గల ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మ్యాన్ హోల్స్ పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కాంగ్రెస్ పార్టీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు దేవావత్ సురేష్ నాయక్, నాయకులు లతీఫ్, హస్సాం, ఇస్మాయిల్, జానీ, జావీద్, నరేష్, కిషన్ తదితరులు ఉన్నారు.

చందానగర్ సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రం ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here