ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా – రూ. 12 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం‌ బాసటగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన రూ.12 లక్షల చెక్కులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతర సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, మాధవరం రంగారావు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ పటేల్, కాశీనాథ్ యాదవ్, దారుగుపల్లి నరేష్, పద్మారావు, తిరుపతి, రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here