పేద విద్యార్థులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ నోట్ బుక్స్ పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పేద విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తుందని ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి చెప్పారు. చందానగర్ డివిజన్ ఇందిరానగర్ లోని ఎంపీపీఎస్ ప్రభుత్య పాఠశాలలోని విద్యార్థులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ తదితర అవసరమైన వస్తువులను బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి, డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాబ్యాసం కోసం 13 సంవత్సరాలుగా బొబ్బ ట్రస్ట్ సేవలందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, గౌస్, శభాన తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా నగర్ లోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ ‌ను అందజేస్తున్న ట్రస్ట్ చైర్మన్ విజయ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here