శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ కి దివంగత నేత పి జనార్దన్ రెడ్డి పేరు నామకరణం చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టిపిసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల పురుషోత్తం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, P జనార్దన్ రెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ రక్తపు జంగం గౌడ్, వార్డ్ మెంబరు గడ్డ నర్సింగ్, వేణుగోపాల్, మల్లేపల్లి శివ, ఆంజనేయులుసాగర్, సాయిలు, R నారాయణ నాయక్, శివ, నవీన్ గంగాధర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.