కేసీఆర్‌ను మించిన నిరంకుశ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి: ధ‌ర్మ‌తేజ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): HCUలో భూముల వేలం ఆపాల‌ని విద్యార్ధులు చేస్తున్న ఉద్య‌మానికి aisf శేరిలింగంపల్లి మండల సెక్రటరీ ధ‌ర్మ‌తేజ మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించే కార్యక్రమాలు చేస్తున్నార‌ని విమర్శించారు. hcu భూమలను అమ్మకానికి పెట్టడం హేయమైన చ‌ర్య అని అన్నారు. అడ్డు అదుపులేని హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చుకోవడానికి hcu భూములపై కన్నేసి అక్కడ ఉన్న వన్యప్రాణులపై కనీస‌ మానవత్వం లేకుండా జేసీబీలు పెట్టి చదును చేయిస్తూ అడ్డు మాట్లాడిన hcu విద్యార్దులను అరెస్ట్ చేస్తూ కెసిఆర్ ను మించిన నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నార‌ని అన్నారు. విద్యార్దుల న్యాయమైన డిమాండ్ పరిగణనలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి కంచె 400 తీసుకున్న నిర్ణయాన్ని వెన్నక్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here