శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగూడకి చెందిన కట్ట ప్రసాద్ రావు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా CMRF ద్వారా మంజూరైన రూ.40,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి , పోతుల రాజేందర్, పురేందర్ రెడ్డి, చాట్ల రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.