శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 6 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.2,20,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, నరేష్ ముదిరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.