శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన మనోజ్ కుమార్ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.3,00,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరు పత్రాన్ని, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీకి చెందిన భీమ రాజు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.1,50,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరు పత్రాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబయ్య, ఖాసీం, లియాకాత్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.