శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 33 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.17,93,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరావు, చంద్రిక ప్రసాద్ గౌడ్, కావూరి అనిల్, ఎల్లం నాయుడు,చిరుమూర్తి రాజు, సల్లావుద్దీన్ ,రాము, సాయి తదితరులు పాల్గొన్నారు.
