శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్పేట డివిజన్ మదీనాగూడకు చెందిన జోసెఫ్ కుమార్తె కీర్తన హాస్పిటల్ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు అయిన రూ.1.20 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు షేక్ బాజీ, ముస్తఫా, భిక్షపతి, రత్నాళ్ రెడ్డి, కృష్ణ, విష్ణు తదితరలు పాల్గొన్నారు.