స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని నల్లగండ్ల కాలనీ వాసుల విన‌తి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల‌పై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నల్లగండ్ల కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డు ను వేయాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర‌చాలని, వీధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే నల్లగండ్ల కాలనీ లో పర్యటిస్తానని, నల్లగండ్ల హుడా కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రగడ సత్యనారాయణ, నవీన్, వర్మ ,ప్రభాకర్ రెడ్డి,చంద్ర, కృష్ణ, విజయ్, రమేష్, శ్రీనివాస్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన నల్లగండ్ల కాలనీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here