నమస్తే శేరిలింగంపల్లి: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ఆలిండియా బంజారా సేవ సంఘం కేంద్ర కార్యదర్శి, జీహెచ్ఎంసీ ఎస్ఈ ఆర్ మోహన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందులాల్ మరణం తనను ఎంతో బాదించిందని, ఆయనతో తన పరిచయం నేటిది కాదని, 1983 నుంచి తనకెంతో ఆత్మీయుడని అన్నారు. చందూలాల్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకుడని, మనసున్న మహారాజని, బీదా ధనిక అనే తారతమ్యం లేకుండా అందరికీ పని చేసి పెట్టిన మహనీయుడన్నారు. చందూలాల్తో కలిసి సామాజిక బాధ్యతగా జాతి సమస్యలను, నిరుద్యోగుల, ఉద్యోగుల, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి సఫలీకృతమయ్యాముని అన్నారు. ముఖ్యంగా టీచర్ల నియామకాలలో టి టి ఇ సర్టిఫికేట్ లేకుండా ఉపాధ్యాయులగా మొదట అవకాశం ఇచ్చి తరువాత ట్రైనింగ్ చేసే విధంగా ఆర్డర్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్/కాలేజీల స్థాపనలో ఘనత మరువలేనిదన్నారు. మరి ముఖ్యంగా బంజారాలకు బంజారా భవనం కూడా ఆయన హయాంలో కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఇటువంటి ఎన్నో సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లి సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆయన కార్యదక్షతకు మెచ్చి ప్రజలు గ్రామ సర్పంచ్ నుండి పార్లమెంటు పార్లమెంట్ వరకు పట్టం కట్టారని అన్నారు. అంతగొప్ప నాయకుడైన చందులాల్ మృతి బంజారా సమాజానికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నట్టు మోహన్ సింగ్ తెలిపారు.
