పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో విఢత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి నిర్వహించారు. అందులో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ ఫేజ్ 1, శంకర్ నగర్ ఫేజ్ 2, భవానిపురం, కేఎస్ఆర్ ఎన్ క్లేవ్, ఇక్రిషాట్ కాలనీలలో ఆయా శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలలో పారిశుధ్య పనులు సజావుగా నడుస్తున్నాయా అని, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాలనీ వాసులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన స్వచ్ఛ్ ఆటోల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ స్రవంతి, వాటర్ వర్క్స్ మెనేజర్ సునిత, శానిటేషన్ విభాగం, ఎలక్ట్రిసిటీ అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో పాల్గొన్న చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here