నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సురభి వాణీదేవి గెలుపే లక్షంగా చందానగర్లో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ టీయూఎఫ్ఐడీసీ ఛైర్మెన్ విప్లవ్ కుమార్, ఎన్నికల ఇంచార్జీలు వాసాల రమేష్, మహేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారత దేశం నుండి ఎన్నికైన తొలి తెలుగు ప్రధాని, మన తెలంగాణ వాసి , ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు కుమార్తె సురభి వాణి దేవిని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం మన అందరి భాద్యత అని శ్రేణులకు పిలుపునిచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు,చేపట్టిన అభివృద్ధిని ప్రతిఒక్క పట్టభద్రులకు తెలిపి,వారిని స్వయంగా కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలాగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు దాసరి గోపి, జనార్దన్ రెడ్డి, గుడ్ల ధన లక్ష్మీ, ప్రవీణ్, గురు చరణ్ ధూభే, పారునంది శ్రీకాంత్ , అక్బర్ ఖాన్, మల్లేష్ గుప్తా, వెంకటేష్, రవీందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, యూసఫ్ ఖాన్, దాస్ తదితరులు పాల్గొన్నారు.
