నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్లో తాగునీటి పైప్లైన్ పగిలి గంటల పాటు నీరు వృదా పోయింది. చందానగర్ వెంకటాద్రి కాలనీని ఆనుకుని ఉన్న జీహెచ్ఎంసీ పార్కు స్థలం బల్దియా అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి చందానగర్ పరిసర ప్రాంతాలను తాగునీటిని సరఫరా చేసే 200 ఎంఎం డయా పైప్లైన్ కు జేసీబీ తగిలి పగిలిపోయింది. సాయంకాలం సమయంలో పెద్ద ఎత్తున తాగునీరు వృదాగా పోయింది. ఈ విషయమై జలమండలి చందానగర్ సెక్షన్ మేనేజర్ సుబ్రహ్మణ్య రాజును వివరణ కోరగా సమస్య తమ దృష్టికి వచ్చిందని, శుక్రవారం పైప్లైన్కు మరమ్మత్తులు జరిపి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అన్నారు.