వడ్డెర బస్తీలో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని వడ్డేర బస్తీలో నుతంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. వడ్డెర బస్తీలో మౌలిక వసతుల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. రోడ్లు, డ్రైనేజీ పనులను దశల వారీగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా, కల్పన, వర్క్ ఇన్స్ స్పెక్టర్లు జగదీష్,నవీన్, తదితరులు పాల్గొన్నారు.

వడ్డెర బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలిస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here