మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ బస్ డిపో-1 నుంచి ఆంధ్రప్రదేశ్కు బస్సు సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని అన్నారు. మియాపూర్ నుంచి విజయవాడ, కాకినాడ, మైసూర్, బెంగళూరు, విశాఖపట్నం, పోలవరం, భద్రాచలం ప్రాంతాలకు రాజధాని, గరుడ ప్లస్, సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతామని తెలిపారు. ఉదయం 4.30 గంటలకు మొదటి బస్సు ఉంటుందని, రాత్రి 10.30 గంటలకు చివరి బస్సు ఉంటుందని తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.