శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సబ్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తారానగర్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీర్స్ ఎన్క్లేవ్, హుడా, శాంతినగర్, ఇందిరా నగర్, చందానగర్, లింగంపల్లి, మార్కెట్, తారానగర్, ఎస్ఎం లే అవుట్, ఓల్డ్ లింగంపల్లి, రైతు బజార్, లింగంపల్లి పోలీస్ స్టేషన్, హుడా ట్రేడ్ సెంటర్, రైల్ విహార్, శివాజీనగర్ ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు.