బీపీ మండ‌ల్ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, యాదవ్ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో బీపీ మండల్ ఫంక్షన్ అవార్డుల పోస్టర్ ను ఆవిష్క‌రించారు. ఈ ఆవిష్కరణ సమావేశంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చైర్మన్, గోకుల్ యూత్ ఫౌండర్ అధ్యక్షుడు గోకుల్ నెర్స్ శ్రీధర్ యాదవ్, సంగారెడ్డి జిల్లా విద్యావంతుల వేదిక అధ్యక్షుడు పాండురంగారావు, యాదవ సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గోకుల్ శివ కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, అశోక్ నగర్ చంద్ర యాదవ్, వెంకట్రావు యాదవ్, నందగోపాల్ యాదవ్, పాములేటి యాదవ్, అందెల కుమార్ యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, సాయి యాదవ్, బాలరాజ్ యాదవ్, ఇస్నాపూర్ యాదవ సంఘం అధ్యక్షుడు బాలు యాదవ్, వీర్ల కోటేశ్వర్ రావు, కృష్ణ యాదవ్, అశోక్ నగర్ వెంకట్ రాజు యాదవ్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలందరూ ఏప్రిల్ 13వ తేదీన బ‌షీర్ బాగ్ ప్రెస్ క్ల‌బ్‌లో నిర్వ‌హించ‌నున్న బీపీ మండ‌ల్ అవార్డ్స్ కార్యక్ర‌మానికి హాజరు కావాల‌ని పిలుపునిచ్చారు. బహుజన సమాజం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యాదవ సమాజం, ముదిరాజులు, మున్నూరు కాపు, గౌడ్స్, పద్మశాలీలు బీసీలందరూ ప్రత్యేకంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here