శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆయనను తన ఇంట్లో కలిసిన నాయకుడు బాలింగ్ గౌతమ గాడ్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గౌడ్, దేవదుర్గ గిరి, కాశీనాథ్, లడ్డు, రాములు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.