మైసమ్మ దేవాలయంలో ప్రభుత్వ విప్ గాంధీ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: ఆషాఢ మాసం బోనాలు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ మధురా నగర్ కాలనీ లోని శ్రీ మైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు రమేష్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, మాజీ కార్పొరేటర్ సాయిబాబా

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here