శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనందుకు గాను పార్టీ శేరిలింగంపల్లి ఇన్ చార్జి, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్కు పార్టీ రంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జగదీశ్వర్ గౌడ్ ఇంకా ఇలాంటి మరెన్నో పదవులను చేపట్టాలని కోరుకున్నట్లు తెలిపారు.