శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రొఫెషనల్స్ ఫర్ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై అవగాహన, అభిప్రాయ సేకరణలో భాగంగా రాజ్ భవన్ రోడ్ లోని కత్రియ హోటల్ లో వివిధ రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సంఘాల నాయకులు, వ్యాపారవేత్తలు, మేధావులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రజలతో సమావేశం నిర్వహించి ఒక దేశం – ఒక ఎన్నిక పై అవగాహన, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వన్ నేషన్-వన్ ఎలక్షన్ జాతీయ కన్వీనర్ అనిల్, వన్ నేషన్-వన్ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రాంచందర్, ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులతో కలసి బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని అనూష మహేష్ యాదవ్ పాల్గొన్నారు.