నమస్తే శేరిలింగంపల్లి: ఎంఏ నగర్ లో కాలనీ వాసులకు అవసరమయ్యే కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చెప్పారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో డ్రైనేజీ మురుగు నీరు రోడ్లపై నిలవడం తదితర సమస్యలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంఏ నగర్ కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిగౌడ్, రాజుగౌడ్, విజయ్ ముదిరాజ్, వాటర్ రాజు, శివ ముదిరాజ్, బాబ్జీ, శివ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/07/IMG-20220721-WA0044.jpg)