నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనత యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా శేరిలింగంపల్లి కి చెందిన రాగిరి సాయిరాం గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యునిగా నియమించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీజేవైఎం బలపరిచడంలో, 2023 లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
