బిజెపి యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఇన్చార్జీగా నంద‌కుమార్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌త పార్టీ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఇన్చార్జీగా రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ మాజీ వైస్ చైర్మ‌న్‌, బిజెపి రాష్ట్ర నాయ‌కులు నంద‌కుమార్ యాద‌వ్ నియ‌మితుల‌య్యారు. పార్టీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజ‌య్ జిల్లాల ఇన్చార్జీల పేర్లు ప్ర‌క‌టించారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఇన్చార్జీగా నంద‌కుమార్ యాద‌వ్ నియామ‌కం పట్ల శేరిలింగంప‌ల్లి బిజెపి నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా నంద‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి జిల్లా ఇన్చార్జీ భాద్య‌త‌ల‌ను అప్ప‌గించిన పార్టీ జాతీయ‌, రాష్ట్ర నాయ‌క‌త్వానికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికే ఆధ్యాత్మిక రాజ‌దానిగా వెలుగొంద‌నున్న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో బిజెపి బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని అన్నారు. స్థానిక నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని కేంద్ర ప్ర‌భుత్వ పథ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ‌తామ‌ని అన్నారు.

నంద‌కుమార్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here