హఫీజ్‌పేట్ డివిజన్ లో బీజేపీ ఎమ్మెల్సీ ఓట‌రు న‌మోదు

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్, యూత్ కాలనీలలో బీజేపీ నాయకుడు బోయిని మహేష్ యాదవ్ ఆధ్వ‌ర్యంలో ఎంఎల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ యాద‌వ్ మాట్లాడుతూ.. యువత ఎంతో ఉత్సహవంతంగా ఓటరు నమోదు చేయించుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రామచందర్ రావుని అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తాం అని యువ‌త‌ ప్రతిజ్ఞ చేశార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్, జగదీశ్, పరమేష్, సుధాకర్, గోరకు తదితరులు పాల్గొన్నారు.

ఓట‌రు నమోదు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బోయిని మహేష్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here