హైదర్ నగర్ డివిజన్ లో బిజెపి నాయకుల పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలో‌ని పలు ప్రాంతాల్లో బిజెపి నాయకులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరినా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. చెరువుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించక పోవడంతో దోమలు వృద్ధి చెందడం, దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపడుతామని హెచ్చరించారు. హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో బిజెపి నాయకులు గజ్జల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, నవీన్ గౌడ్, కృష్ణ బాలయ్య, వెలగపూడి సీతారామరాజు చారి తదితరులు పాల్గొన్నారు.

హైదర్ నగర్ డివిజన్ లో పాదయాత్ర చేస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here