బిజెపి రంగారెడ్డి (అర్భ‌న్‌) జిల్లా అధికార ప్రతినిధిగా అందెల కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి (అర్భ‌న్‌) జిల్లా అధికార ప్రతినిధిగా లింగంప‌ల్లి గ్రామానికి చెందిన‌ అందెల కుమార్ యాదవ్ నియామకమయ్యారు. కుమార్ యాదవ్‌కు జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌లు నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సంద‌ర్భంగా అందెల‌ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో భాద్య‌త‌లు అప్ప‌గించినందుకు జిల్లా అధ్యక్షుడు సామారంగారెడ్డి, అసెంబ్లీ ఇంచార్జి యోగానంద్, జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ ల‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న ప‌ధ‌కాల‌ను త‌మ గొప్ప‌లుగా చెప్పుకుంటూ ప్ర‌చారం చేసుకుంటున్న రాష్ట్ర ప్ర‌భుత్వ దుశ్య‌ర్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తామ‌ని అన్నారు. జిల్లాలో భార‌తీయ జ‌న‌త పార్టీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తాన‌ని అన్నారు.

కుమార్ యాదవ్‌కు నియామకపు పత్రాన్ని అందజేస్తున్న జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here