గ‌వ‌ర్న‌ర్ తమిళిసైను క‌లిసిన‌ శ్రీరామ జీవ సేవా సదన్ గోశాల నిర్వాహకులు

నమస్తే శేరిలింగంపల్లి: పటాన్‌చెరు నందిగామలోని శ్రీ రామ జీవ సేవా సదన్ గోశాల నిర్వాహకులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి పండగను పురస్కరించుకుని రాజ్‌భ‌వ‌న్‌లో తెలంగాణ‌ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ‌న్‌ శ్రీ రామ జీవ సేవా సదన్ గోశాల కార్యదర్శి కమల్ కిషోర్ మర్దా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేష్ తపాడియా, గవ్య చేతన అమితాబ్ భట్నాగర్‌లు కలిసి పండుగ‌ శుభాకాంక్షలు తెలిపారు. గోశాల నిర్వ‌హ‌ణ అంశాల‌ను వారు గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. హిందువులు త‌ల్లిగా ఆరాధించే గోవులకు కోసం ప్ర‌త్యేకంగా గోశాల ఏర్పాటు చేసి వాటి బాగోగులను చూసుకోవడం గొప్ప విషయమని గోశాల నిర్వాహ‌కుల‌ను గవర్నర్ తమిళిసై అభినందించారు.

గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ‌న్‌తో కమల్ కిషోర్ మర్దా, రాజేష్ తపాడియా, అమితాబ్ భట్నాగర్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here