శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు, యాదవ మహాసభ సలహాదారు, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలను నేతాజీ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షులు రాయుడు, బీసీ ఫెడరేషన్, నేతాజీ నగర్ కాలనీ సంక్షేమ సంఘం, నేతాజీ నగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని ఇలా సంతోషంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, యువజన సంఘం అధ్యక్షుడు సైదులు యాదవ్, సెంట్రల్ యూనివర్సిటీ సీనియర్ ఉద్యోగి నరసింహ యాదవ్, కే రాము యాదవ్, వెంకట్, రాజేష్, కిరణ్, కుమార్, కృష్ణ గౌడ్, కిరణ్ ముదిరాజ్, రాజు పద్మశాలి, శివసాగర్, రాజేష్ నాయక్, యువజన విభాగం అధ్యక్షుడు డీజే భవన్, బాలరాజ్ సాగర్, భరత్, విజయ్, అశోక్, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.