శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయిన జస్టిస్ బీఆర్ గవాయ్ని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ కె.సునీల్ గౌడ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని లలిత్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎస్జీ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడు విష్ణు వర్దన్ రెడ్డి, అధ్యక్షులు జయకర్, గోకుల్ రామారావు, కార్యదర్శులు ఎ.జగన్, ఇంద్రసేనా రెడ్డి, మాజీ కార్యదర్శి శాంతి భూషణ్ పాల్గొన్నారు.