శేరిలింగంపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): బిసి వర్గానికి చెందిన వాకాటి శ్రీహరి ముదిరాజ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బీసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడి ఒకటిన్నర సంవత్సరాలు గడిచినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఎన్నికలు, సామాజిక, రాజకీయ , ఆర్థిక న్యాయం కోసం చేయాల్సిన పోరాటం వంటి అంశాలపై చర్చించారు. బీసీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని, ఒకవేళ ఎన్నికలను జూలై నెలలోనూ నిర్వహించకపోతే 33 జిల్లాల బీసీలను, బీసీ సంఘాలను నాయకులందరి ఏకం చేసి అందరి సహాయ సహకారాలతో జేఏసీ భాగస్వాములైన ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ సహాయంతో ఇందిరాపార్క్ వద్ద పదివేల మందితో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రదర్శన అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శ్రీకృష్ణ కాలనీ అధ్యక్షుడు వెంకట ముదిరాజ్, మియాపూర్ డివిజన్ బీసీ సంఘం అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, శేరిలింగంపల్లి మహిళా కోఆర్డినేటర్ లలిత, రజక సంఘం కృష్ణ, పద్మశాలి సంఘం అశోక్, నాయి బ్రాహ్మణ సంఘం రాము, గౌడ సంఘం నాయకుడు కిరణ్, బీసీ నాయకులు పాల్గొన్నారు.