శేరిలింగంపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐ ఎఫ్ డి ఎస్) తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను మియాపూర్ ఎంఏ నగర్ ఆఫీసులో ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులకు ప్రారంభ ఉపన్యాసకుడిగా హాజరైన జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి తన రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన కాలంలోనే నరేంద్ర మోడీ విద్యారంగంలో కేంద్రీకరణ కార్పోరేటీకరణ, కషాయీకరణను వేగవంతం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఎన్ టి ఏ లాంటి కేంద్రీకృత విధానాలకు ఆమోదముద్ర వేసి పేపర్ లీకేజీ కావడం, అమ్ముకోవడానికి ప్రోత్సహించడం వలన నీట్ పరీక్ష రాసిన 24 లక్షలకు పైగా విద్యార్థులకు అన్యాయం చేశారు అని అన్నారు. దేశంలో అనేక పోటీ పరీక్ష పత్రాలు లీకేజ్ అరికట్టడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలయింది. 2014 కేంద్ర బడ్జెట్లో విద్యకు 6% నిధులు కేటాయిస్తే 2024 వరకు 2.5 శాతానికి తగ్గిందన్నారు.
ప్రజాపాలన పేరు మీద గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత విధానాన్ని కొనసాగిస్తుంది. తన మేనిఫెస్టో లో విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తానని చెప్పి 7.3% మాత్రమే కేటాయించడం సిగ్గు చేటు అన్నారు. ఈ అభ్యాసన సంక్షోభం నుండి రాష్ట్రం బయటపడడానికి సరైన విధానం తీసుకురాకుండా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొన్ని ఆకస్మిక ఆలోచన అనాలోచిత చర్యలు చేపడుతుంది. సుమారు 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసే బదులు బిఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాల అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనీ , ప్రభుత్వ రంగంలో ఉన్న 17 యూనివర్సిటీలను సమగ్రంగా అభివృద్ధి చేసే బదులుగా స్కిల్ యూనివర్సిటీ అనీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని కొన్ని పొంతనలేని చర్యలు చేపడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని అన్నారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్ గా ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, ఏ ఐ ఫ్ డి ఎస్ జాతీయ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు టింకటి కుమార్, హైదరాబాద్ కన్వీనర్ శ్రీకాంత్, మార్త నాగరాజ్, పోలబోయిన రాజు , సాయిరాం రెడ్డి, జవాజి శ్రీజిత్ , అరుణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.