ప్రభుత్వ విప్ గాంధీని కలిసిన బావతారక నగర్ బాధితులు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ మాజీ కార్పొరేటర్ సాయి బాబా ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీకి వినతి పత్రం అందజేశారు. 30 సంవత్సరాలుగా గుడిసెలు, షెడ్లు వేసుకుని బతుకుతున్నాం అని అధికారులు కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సురేందర్, బసవతారక నగర్ కాలనీ వాసులు శ్రీనివాస్, రాజేందర్, జోసఫ్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీకి వినతి పత్రం ఇస్తున్న బావతారక నగర్ బాధితులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here