శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు బండారి మోహన్ ముదిరాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిధిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతోపాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ హాజరై బండారి మోహన్ ముదిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, దొంతి శ్రవణ్ కుమార్ ముదిరాజ్, భగత్, సాయికిషోర్, సాయినాగేష్, వీరేందర్, కిరణ్, మల్లికార్జున పాల్గొన్నారు.






