హ‌ఫీజ్‌పేట‌లో ఘ‌నంగా గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

మియాపూర్‌, సెప్టెంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని సాయిన‌గ‌ర్ కాల‌నీ ప్ర‌ధాన కూడ‌లి వ‌ద్ద ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పంలో డివిజ‌న్ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు బాలింగ్ గౌత‌మ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజ‌రై గ‌ణేషుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

వినాయ‌కుడికి పూజ‌లు చేసిన బాలింగ్ గౌత‌మ్ గౌడ్

అనంత‌రం బీఎస్‌జీ యూత్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాన్ని వ‌డ్డించారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున పూజ‌ల్లో పాల్గొని తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాల‌నీ వాసులు సంజు, శ్రీ‌ధ‌ర్‌, రెడ్డి, బీఎస్‌జీ యూత్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదం వ‌డ్డిస్తున్న గౌత‌మ్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here