నేడు విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గురువారం (29-01-2026) నిర్వహించనున్న నిర్వహణ పనుల కారణంగా ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంద‌ని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు 33/11 కేవీ కేపీహెచ్‌బీ సబ్‌స్టేషన్ నుంచి వెలువడే 11 కేవీ హైదర్‌నగర్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అన్నారు. జయభారత్ నగర్, నిజాంపేట్ రోడ్, నందమూరి నగర్, బృందావన్ కాలనీ, హైదర్‌నగర్ గ్రామంల‌లో విద్యుత్ ఉండ‌ద‌ని అన్నారు. అలాగే మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు 33/11 కేవీ మయూరి నగర్ సబ్‌స్టేషన్ నుంచి వెలువడే 11 కేవీ ప్రశాంత్ నగర్ ఫీడర్ పరిధిలోని ప్రశాంత్ నగర్, మయూరి నగర్ (పార్ట్‌), ఎస్‌బీఐ బ్యాంక్ రోడ్, వాటర్ ట్యాంక్ ప్రాంతం, జీఎల్‌ఆర్ కాలనీ ఓల్డ్ ఏజ్ హోం, ఇంద్రిమ్మ కాలనీ ఫేజ్-1, వెంకట్రాయ నగర్ ల‌లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంద‌ని తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఏర్ప‌డే అంత‌రాయాన్ని వినియోగదారులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని విద్యుత్ శాఖ కోరింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here