గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలోని నల్లగండ్ల 11కేవీ హుడా విద్యుత్ ఫీడర్ పరిధిలో గురువారం కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు తారానగర్ ఆపరేషన్స్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నందున ఫీడర్ పరిధిలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తెల్లాపూర్ చౌరస్తా, నల్లగండ్ల వాటర్ ట్యాంక్, నల్లగండ్ల హుడా కాలనీలలో కరెంటు ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎపిస్టోమ్ ఫీడర్ పరిధిలోని తెల్లాపూర్ రోడ్డు, సాధన స్కూల్ బ్యాక్ సైడ్, ఎపిస్టోమ్ గ్లోబల్ స్కూల్, రాక్ పార్క్ సైడ్ ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు.