శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని తారానగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫీడర్ పరిధిలోని మసీదు ప్రాంతం, సబ్ స్టేషన్ ఎదురుగా, శివాజీనగర్, పోచమ్మ ఆలయం ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెంకట్ రెడ్డి కాలనీలో కరెంటు ఉండదని అన్నారు.