ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీల ఎంపిక

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తీలో టీఆర్ఎస్ నూతన బస్తీ, మహిళ, యూత్, మైనారిటీ కమిటీలను మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే ప్రతి నాయకునికి అండగా నిలుస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆదిత్య నగర్ బస్తీ కమిటీ అధ్యక్షునిగా మునాఫ్ ఖాన్, మహిళ కమిటీ అధ్యక్షురాలిగా పర్వీన్ బేగం, యూత్ కమిటీ అధ్యక్షునిగా ఖాజా, మైనారిటీ విభాగం అధ్యక్షునిగా విల్సన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివ రావు, రహీమ్, నాయకులు బాబుమియా, లియాకత్, సలీం, మియాన్, అజీమ్, జాఫర్, యూత్ సభ్యులు షేక్ ఖాజా, షేక్ కలీల్, మొహమ్మద్ అమీర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, మొహమ్మద్ ఫసియుద్దిన్, అల్తాఫ్ ఖాన్, మూస, సయ్యద్ మీరజ్ హుస్సేన్, షేక్ ఇమ్రాన్, మొహమ్మద్ రయీస్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్య నగర్ లో టీఆర్ఎస్ బస్తీ కమిటీలను నియమిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here