శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): అక్రమ అడ్మిషన్స్ నిర్వహిస్తున్న ఎలెన్ సంస్థపై చర్యలు తీసుకోవాలని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి డిమాండ్ చేశారు. ఏఐఎఫ్డిఎస్ గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో ఎలైన్ విద్యాసంస్థ ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నిర్వహించేందుకు తేదీలు ప్రకటించక ముందే ఎలాంటి అడ్మిషన్స్ నిర్వహించొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ అలెన్ అనే విద్యా సంస్థ గత మూడు నెలలుగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అడ్మిషన్స్ చేస్తున్నారని, ఒక్కో విద్యార్థి ఫీజు సుమారు నాలుగు లక్షల రూపాయలు మొదటి సంవత్సరానికి వసూలు చేస్తున్నారు.
అంతేకాకుండా బుక్స్ యూనిఫామ్ బ్యాచ్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటివరకు వారికి కనీసం ఒక్క కాలేజీకి కూడా పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న పలు కాలేజీలపై ముఖ్యంగా ఏలెన్ అనే విద్యాసంస్థ పై గత నెలలో డిఐఇఓ కి పలుసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ సంబంధిత అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. డిఐఇఓ ఆలెన్ విద్యా సంస్థపై చర్య తీసుకోకపోతే డిఐఓ ఆఫీసు ముందు నిరసన తెలియజేస్తాం. భవిష్యత్తులో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులకు కార్యక్రమాల ద్వారా బుద్ధి చెప్తామని అన్నారు ఈ కార్యక్రమంలో AIFDS గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ m.శ్రీకాంత్, సంఘం నాయకులు అరుణ్, రవి, పవన్, కటిక పవన్, వేణు, ప్రశాంత్, వంశి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.